ప్రకృతి విపత్తుల్లో చాలా వరకు మనిషి తన ప్రాణాలు కాపాడుకునే అవకాశాలు చాలా తక్కువనే చెప్పొచ్చు. వరదల్లో చిక్కుకున్నవారైతే చూస్తుండగానే క్షణాల్లో కోట్టుకొనిపోయి ప్రాణాలు బలి కావడం హిమాచల్ప్రదేశ్లో మన తెలుగు విద్యార్థుల విషయంలో జరిగింది. అయితే అక్కడ సమయానికి రక్షణ చర్యలు అందక, సహాయం చేయడానికి వీలు పడక తమ తోటి మిత్రులను కాపాడుకోలేకపోయామని తిరిగొచ్చిన విద్యార్థులు చెప్పడం మనం చూశాము.
అయితే, ఇలాంటి విపత్కర పరిస్తితుల్లో ఏం చేయాలో ఇపుడు చూద్దాం. ఇపుడు చెప్పేవిధంగా ప్రయత్నిస్తే చాలా వరకు ప్రాణాల్ని రక్షించుకోవచ్చు.
నీటికి గల బలం మన మనిషి బలం & బరువు కన్నా చాలా ఎక్కువ. కాబట్టి మనిషి రెండు కాళ్ళతో నీటి ప్రవాహ వేగానికి, ఒత్తిడికి తగినంత వ్యతిరేక దిశలో బలం ప్రయోగించలేక పట్టు జారి కొట్టుకు పోవడం జరుగుతుంది. అక్కడ ఎంత మంది ఉన్నా, అందరిదీ అదే పరిస్థితి.
అలాంటప్పుడు, ఒకరినొకరు పక్కపక్కన పట్టుకొని ఉంటే, అందరి బలం విడదీయబడి నీటి బలాన్ని ఎదిరించలేరు. కాబట్టి, నీటి ప్రవాహానికి ఎదురుగా ఒకరివెనక ఒకరు దగ్గరగా నిలబడి పట్టుకుంటే, అందరి బలం కలిసిన మొదటి మనిషి మొత్తం బలం, నీటి ప్రవాహ నిరోదానికంటే ఎక్కువయ్యి ప్రవాహాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ప్రవాహం తగ్గిన తర్వాత లేదా సహాయక చర్యల బయటికి రావచ్చు.
ఈ పద్దతిని కొందరు ప్రయోగాత్మకంగా పరీక్షించి మరీ ఋజువు చేశారు. ఆ వీడియోని కింద చూడవచ్చు. కాని, అందరికీ షేర్ చేయ్యడం మాత్రం మరవద్దు.
No comments:
Post a Comment